Monday, April 13, 2009

Plagiarism అప్పుడే మొదలైంది.


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని ధంకా బజాయించి మరీ చెప్తుంటాం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం (లిఖిత పూర్వక) అని జబ్బలు చరుస్తాం. కానీ తొడ గొట్టే బాలకృష్ణ డయలాగ్ మర్చి పోయినట్టు "వండుకున్నమ్మకి ఒక్కటే కూర..." సామెతని మాత్రం చాలా కంఫర్టబుల్ గా మర్చిపోతాం.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. అవును కానీ అందులో ఒక్కటంటే ఒక్క original అంశాన్ని చూద్దామంటే హైదరాబాద్ లో ఒయాసిస్ కోసం వెతికినట్టు అవుతుంది. అక్కడే మన పెద్దలు Plagiarism is our birth right అని చాటారు.
కొన్ని సూత్రాల్ని అమెరికా నుంచీ, మరి కొన్నింటిని జర్మనీ నుంచీ, ఇంకొన్నింటిని దక్షిణాఫ్రికా నుంచీ, ఆస్ట్రేలియా, ... వగైరహ్ లైన దేశోత్తమాల నుంచీ ఎత్తుకొచ్చి అలా మన ప్రజానీకానికి 'మన'వి చేసుకున్నారు.
అలా మన పెద్దలు మనవి చేసుకోవటం చూపగానే మన ప్రజానీకం నాయకుల ఆదర్శ బుడుంగు జాడలలో నడిచి ఆల్ మనవి చేసుకోవటాన్ని అలా అలా కొనసాగించారు.
అక్కడ మొదలైన plagiarism ఇప్పటికీ కొనసా............గి జనం లో ఇంకి, పెంకి, అన్నిటినీ శంకి మనలను డాంకీ, అలా అలా నడిచి పోతున్నది.
అంత పెద్ద భారత దేశమే మనవి చేసుకుంటుంటే చూస్తూ ఉన్న మనం ఎవరో పాపం బ్లాగుల్లో ఏదో పెట్టుకున్నారని దుమ్మెత్తి పోయటం ఏమి న్యాయం?

1 comments:

వెంకట్ July 11, 2010 at 6:45 AM  

wat happened 2 srinagar??? in map

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP